
డిప్యూటీ సూపరింటెండెంట్ లుగా డా.సీతారామయ్య, డా.శ్రీరాములు
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్ గా డా.సీతారామయ్య, డా.శ్రీరాములు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్ గా యూరాలజీ ప్రొఫెసర్, హెచ్ ఓ డి, డా.కె.సీతా రామయ్య , జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డా.డి.శ్రీరాములు ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. ఆసుపత్రిలో పాలన సౌలభ్యం కొరకు ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్ లను నియమించినట్లు తెలిపారు.డా.సీతారామయ్య, డా.శ్రీరాములు డిప్యూటీ సూపరిండెంట్ లుగా నియమించినందుకు ఆసుపత్రి సూపరిండెంట్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమానికి డిప్యూటీ సూపరింటెండెంట్ లు, డా.కె.సీతా రామయ్య, డా.డి.శ్రీరాములు హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివ బాల నగాంజన్, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు తెలిపారు.