డ్రైనేజీ వ్యవస్థను సమన్వయంతో నిర్వహించాలి

డ్రైనేజీ వ్యవస్థను సమన్వయంతో నిర్వహించాలి

 నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.రవీంద్ర

న్యూస్ వెలుగు, కల్లూరు; నగరపాలక ఆయా విభాగాల అధికారులు డ్రైనేజీ వ్యవస్థను సమన్వయంతో నిర్వహించాలని, తద్వారా సంతృప్తికరమైన సత్ఫలితాలు పొందవచ్చని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అన్నారు. శనివారం ఉల్చాల రహదారిలోని నాగేంద్ర నగర్, సిద్దార్థ, అపూర్వ హోమ్స్, వై.జంక్షన్ తదితర ప్రాంతాల్లో కమిషనర్ అధికారులతో కలిసి పర్యటించారు. ఆయా కాలనీల ప్రజలతో సమస్యల తెలుసుకుంటూ కలియతిరిగారు. పలు కాలనీల్లో మురుగు కాల్వలకు ప్రతిపాదనలు రూపొందించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థలో సమస్యలు ఏర్పడకుండా పారిశుద్ధ్య విభాగపు అధికారులు ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులతో సమన్వయం చేసుకోవాలని, అత్యవసర నిర్మాణాలను ఇంజనీరింగ్, పూడికతీత పనులకు వీలులేని కాలువలపై ఆక్రమణల తొలగింపునకు పట్టణ ప్రణాళిక విభాగాల అధికారులతో సమన్వయం చేసుకోవాలని, ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించుకోవాలని ఆదేశించారు. వసతుల కల్పనకు అత్యవసర పనులకు ప్రాధాన్యత ఇస్తూ, జాప్యం లేకుండా అభివృద్ధి పనుల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజారోగ్యధికారి డాక్టర్ కె.విశ్వేశ్వర్ రెడ్డి, డిఈఈ క్రిష్ణలత, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అంజాద్ బాష, ఏఈ భాను ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!