
యువత చొరవతో తొలగిని తాగునీటి సమస్య
తుగ్గలి న్యూస్ వెలుగు : కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని రామకొండ గ్రామంలో గత ఐదు రోజులుగా తాగునీటి సమస్య తలెత్తడంతో గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. దీనిపై గ్రామా సచివాలయ అధికారుల దృష్టికి తిసుకేల్లడంతో వారు స్పందించినట్లు గ్రామా యువత తెలిపారు. పెండేకల్లు ఆర్ ఎస్ లో రైల్వే పనుల కారణంగా అనేక సార్లు పైపు లైండ్లు పగిలిపోవడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఇలాంటివి మల్లి జగకుండా రైల్వే అధికారులు , గ్రామా రెవెన్యు అధికారులు పరిశిలించి సమస్యను పరిస్కరించేదేకు ఉన్నతస్థాయి అధికారులకు నివేదికలు అందించినట్లు వెల్లడించారు. గ్రామంలో తాగునీటి సమస్యను యువత చొరవతో పనులను వేగంగా పరిస్కరించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అధికారులు మరియు యువత మహేష్ , నేట్టురు గణేష్ , శేఖర్ ,రాజేష్ ,నాగరాజు, సారాయి అనిత్ తదితరులు పాల్గొన్నారు.