
త్రాగునీటి సరఫరా వెంటనే పునరుద్ధరించాలి
హోళగుంద, న్యూస్ వెలుగు: మండలంలో నిలిచిన త్రాగునీటి సరఫరాతో పాటు పెంటింగ్ లో ఉన్న కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని సోమవారం వైసిపి నాయకులు గిరి డిఈ మల్లికార్జునకు వినంతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా గిరి మాట్లాడుతూ సమ్మత్తగేరి వాటర్ స్కీమ్ ద్వారా ఎల్లార్తి, చిన్నహ్యట,పెద్దహ్యాట,బిజీ హళ్లి,కొగిలతోట,సమ్మతగేరి మూగుమానగుంది గ్రామాలకు అందుతున్న త్రాగునీరు కార్మికుల వేతనాలు లేక సరఫరా నిలిచిపోయిందని.కావున ప్రజలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా త్రాగునీటి సరఫరా పునరుద్దరణకు చర్యలు చేపట్టాలని కోరారు.అంతేకాకుండా గ్రామాలకు కలుషిత నీటి సరఫరాను అరికట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామ్ లీలా,సిద్దలింగ,అంజప్ప,శీను తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda