అకాల వర్షం తో.. వందల ఎకరాల్లో వరి పంట నష్టం

అకాల వర్షం తో.. వందల ఎకరాల్లో వరి పంట నష్టం

ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల మొర
వెంగళెరెడ్డి పేట,కడమలకాల్వ, ఈర్నపాడు సింగవరం గ్రామాల్లో భారీ వర్షం
బండి ఆత్మకూరు, వెలుగు న్యూస్: ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షం రైతులకు నష్టం కలిగించింది. సోమవారము సాయంత్రం కురిసిన భారీ ఈదురుల గాలులు భారీ వర్షానికి మండలంలోని వెంగళరెడ్డిపేట కడమలకాల్వ, ఈర్నపాడు సింగవరం గ్రామాల్లో వందల ఎకరాల్లో వరి పంట నేలవాలింది.మరో 20 రోజుల్లో పంట చేతికి వచ్చేవేళ అకాల వర్షం నష్టాన్ని మిగిల్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా కొన్నిచోట్ల వరి పంట పొట్టదశ, కంకి పాలు పోసుకున్న దశలో నేలవాలడంతో భారీ నష్టం వస్తుందని దిగులు చెందుతున్నారు. ఇప్పటికే ఒక్క ఎకరాకు 40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టమని ఈ భారీ వర్షంతో భారీ నష్టం వస్తుందని రైతులు కన్నీరు మున్నిరవుతున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి తమ ఆదుకోవాలని ఆయా గ్రామాల రైతుల కోరుతున్నారు. వ్యవసాయ అధికారులు పంట నష్టం అంచనవేసి ప్రభుత్వానికి నివేదిక పంపాల్సి ఉంది.

Author

Was this helpful?

Thanks for your feedback!