
కర్నూల్ విమానాశ్రయంకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టించేలా కృషి చేయాలి
కర్నూల్ విమానాశ్రయంకు “ఉయ్యాలవాడ నరసింహారెడ్డి” పేరు పెడతామని గత పాలకులు అధికారికంగా ప్రకటించి పేరు పెట్టకుండా అవమానించారు
ఓర్వకల్లు, న్యూస్ వెలుగు; కర్నూలు విమానాశ్రయంకు “ఉయ్యాలవాడ నరసింహారెడ్డి” పేరు పెడతామని గత పాలకులు అధికారికంగా ప్రకటించి పేరు పెట్టకుండా అవమానించారని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు పల్లె శ్రీధర్ రెడ్డి తెలిపారు. గురువారం నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరిని కలిసి వినతి పత్రం సమర్పించామని,ఓర్వకల్లు దగ్గర గల కర్నూల్ విమానాశ్రయంకు ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టించేలా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు పల్లె శ్రీధర్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ 2019 లో ముఖ్యమంత్రి హోదాలో కర్నూలు లో విమానాశ్రయం ప్రారంభోత్సవ సందర్భంగా నారా చంద్రబాబునాయుడు కి ఓర్వకల్లులో ప్రారంభమవుతున్న విమానాశ్రయముకు బ్రిటిష్ వారిని ఎదిరించిన పాలేగాడు, ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం తరఫున కోరడమైనది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూల్ విమానాశ్రయ పునః ప్రారంభోత్సవంలో ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి పేరు పెడుతున్నామని స్వయంగా ప్రకటించిన సందర్భంలో రాష్ట్ర ప్రజలు, దేశభక్తులు, రాయలసీమ ప్రాంత వాసులందరూ హర్షం వ్యక్తం చేసి సంబరాలు చేసుకోవడం జరిగిందని, అయితే ప్రకటించి 3 సంవత్సరాలు కావస్తున్నా కర్నూల్ విమానాశ్రయంకు శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెట్టకపోవడాన్ని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుందని తెలిపారు. నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధి బృందంతో మాట్లాడుతూ తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి, సంబంధిత కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకువెళ్లి కర్నూలు విమానాశ్రయంకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టేలా కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. వినతి పత్రం సమర్పించిన వారిలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర సంఘటన కార్యదర్శి టి.ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర నాయకులు బి.వి.సుబ్బా రెడ్డి, జిల్లా నాయకులు రాజారెడ్డి, రంగారెడ్డి, మీనాక్షి రెడ్డి, జ్యోతి రెడ్డి, కోట్ల తిమ్మారెడ్డి, సంపతి తారకేశ్వర్ రెడ్డి,వెంకట తిమ్మారెడ్డి, భాస్కర్ రెడ్డి, , బైరెడ్డి నవీన్ రెడ్డి, కత్తి రాజశేఖర్ రెడ్డి, బైరెడ్డి దినేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సాయి అభయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.