
ఐ.టి వింగ్ అధ్యక్షులుగా మాదిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: పత్తికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఐటీ వింగ్ అధ్యక్షులుగా మండల కేంద్రమైన తుగ్గలికు చెందిన కీర్తిశేషులు మాదిరెడ్డి ప్రతాపరెడ్డి కుమారుడు మాదిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిను ఎంపిక చేస్తూ వైఎస్ఆర్సిపి పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం రోజున ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్సిపి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కు విధేయుడుగా ఉంటూ వైఎస్ఆర్సిపి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.అదేవిధంగా తనకు పదవి రావడానికి సహకరించిన జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎస్.వి మోహన్ రెడ్డి కు,మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి కు,గ్రామ వైసిపి నాయకులు తుగ్గలి శ్రీనివాస్ రెడ్డి కు, తుగ్గలి మోహన్ రెడ్డి కు,మండల వైఎస్ఆర్సిపి నాయకులకు,కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా పత్తికొండ నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షులుగా కడమకుంట్ల రాజశేఖర్,పత్తికొండ నియోజకవర్గం సాంస్కృతిక విభాగం కల్చర్ యాక్టివిటీ అధ్యక్షులుగా ఆర్ఎస్ పెండేకల్ మధు యాదవ్ లు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను గుర్తించి పార్టీలో బాధ్యతలు అప్పగించినందుకు అధినేత జగన్మోహన్ రెడ్డికు,ఎమ్మెల్యే శ్రీదేవి కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క అభివృద్ధి కొరకు తమ వంతు కృషి చేస్తామని వారు తెలియజేసారు.