
విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి
ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ బి రామకృష్ణ రెడ్డి డిమాండ్
న్యూస్ వెలుగు, కర్నూలు; భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కర్నూల్ నగర సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాహార దీక్షలను మూడవరోజు ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ బస్తిపాడు రామకృష్ణారెడ్డి మూడవరోజు రిలే నిరాహార దీక్షకు ప్రారంభించినారు ఈ కార్యక్రమానికి సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు ఎం బీషన్న అధ్యక్షత వహించగా రిలే నిరాహార దీక్షలో కూర్చున్న దండలు వేసి మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచిన సందర్భంలో చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు అనే పేరు పెట్టి ప్రజలతో మీటింగ్లు పెట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచమని అసరమైతే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని అధికారులకు వచ్చిన ఏడు నెలల లోపే రాష్ట్రంలోని పేద ప్రజల పైన 17 వేల కోట్ల రూపాయలు ట్రూ యాప్ చార్జీల పేరుతో భారాలు మోపి ఈ పాప అంతా జగన్మోహన్ రెడ్డి ది అని చేతులు దులుపుకోవడం చాలా దుర్మార్గమని ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చేస్తున్న ఆందోళన చాలా న్యాయబద్ధమైనదని తక్షణమే ట్రూ యాప్ విద్యుత్ ఛార్జీలను తక్షణమే
తగ్గించాలని ఎన్నికల కొద్ది ముందు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సీట్లు పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న పేదలకు రెండు సెంట్లు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు హామీని నిలబెట్టుకోవాలి ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు .సిపిఐ చేస్తున్న దీక్షలు విజయవంతం కావాలని ప్రజల సమస్యలు పరిష్కారం కావాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి నగర సహాయ కార్యదర్శి జి చంద్రశేఖర్ డి శ్రీనివాసరావు సిపిఐ కర్నూల్ రూరల్ మండల కార్యదర్శి సురేంద్ర యాదవ్ కార్యవర్గ సభ్యులు నాగరాజు వెంకటేశు సోమన్న ఈశ్వర్ ఆటో యూనియన్ నగర కార్యదర్శి కృష్ణారెడ్డి మహిళా సంఘం నాయకులు కోటమ్మదేవి భాయ్ ధనలక్ష్మి శాఖా కార్యదర్శులు రామాంజి స్వామి రెడ్డి నగర్ శాఖ కార్యదర్శి రామాంజనేయులు గౌడ్ మహిళలు అధిక సంఖ్యలో ఈ దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు.