విద్యుత్ వినియోగదారుల సమస్యల అవగాహన సదస్సు అదాలధ్
న్యూస్ వెలుగు, మంత్రాలయం; విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక, ఎమ్మిగనూరు ఆధ్వర్యములో నిర్వహించబడుతున్న ప్రత్యేక విద్యుత్ అవగాహనా సదస్సు మరియు అదాలత్ 10-12-2024 మంగళవారముసమయం ఉదయం గం|| 11-30 నుండి 1-30 వరకు స్థలము డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి కార్యాలయం, ఆపరేషన్ సబ్-డివిజన్, మంత్రాలయం. వి. శ్రీనివాస ఆంజనేయమూర్తి, ఛైర్పర్సన్, రిటైర్డ్ జిల్లా జడ్జి ఎ.పి.ఎస్.పి.డి.సి.ఎల్. తిరుపతి వారి ఆధ్వర్యములో ఎమ్మిగనూరు డివిజన్ పరిధిలో మంత్రాలయం నందు ప్రత్యేక విద్యుత్ అవగాహన సదస్సు మరియు అదాలత్ నిర్వహించబడును. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన అధికారులు మరియు సిబ్బంది ఈ అదాలత్కు హాజరవుతున్నారు. కావున విద్యుత్ వినియోగదారుల యొక్క పరిష్కారము కాని సమస్యలు వ్రాత పూర్వక ఫిర్యాదు ద్వారా తెలియబరిచి వారి సమస్యలను పరిష్కరించుకో వలసినదిగా కోరుచున్నాము.