విద్యుత్ ట్రూ ఆప్ చార్జీలను రద్దు చేయాలి

విద్యుత్ ట్రూ ఆప్ చార్జీలను రద్దు చేయాలి

ఆదాని ఒప్పందాలను ఉపసంహరించుకోవాలి
స్మార్ట్ మీటర్లు పేద లైన్లకు బిగించకూడదు

కర్నూలు, న్యూస్ వెలుగు; ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యరాష్ట్ర సమితి పిలుపుమేరకు ఈరోజు తెల్లవారు జామున 5:30 గంటలకు కలెక్టరేట్ ముందు భోగి మంటలు వేసి మంటలలో పెరిగిన కరెంటు చార్జీల బిల్లులను దగ్ధం చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి ఏపీ మహిళా సమాఖ్య నగర కార్యదర్శి కె భారతి, అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పి శ్రావణి ఐద్వా రాష్ట్ర నాయకురాలు నిర్మల పాల్గొని వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు లోపే రెండుసార్లు కరెంటు చార్జీలు పెంచి పేదలపై దాదాపు 17 వేల కోట్ల రూపాయలు దారాలు మోపి డిసెంబర్ జనవరి నెలల బిల్లులు ఒక్కొక్కరికి రెండు వింతలు కరెంట్ బిల్లులు పెరిగాయని ఈ విధానం తక్షణమే ఉపసంహరించుకోవాలని అధికారంలో లేనప్పుడు చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు ఏ హామీ ఇచ్చాడో గుర్తు చేసుకోవాలని ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై బాదుడే బాదుడు అని ప్రచార సభలలో చెప్పినటువంటి చంద్రబాబు మరి ఏడు నెలల కాలంలో 17 వేల కోట్లు పేదలపై భారాలు మోపడం మరి దీనిని చంద్రబాబు నాయుడు  భాషలో దీని పేరు వీరాబాదుడని అని అంటున్నావ్ వచ్చే నాలుగున్నర సంవత్సరకాలంలో మరి ఎన్నిసార్లు చార్జీలు పెంచాలో పేదల ఒకసారి ఆలోచన చేసుకోవాలని ఈ సందర్భంగా అన్నారు ఆదానిపై అవినీతి కేసులు నమోదయి ప్రపంచవ్యాప్తంగా ఆదాని మోసగాడని చెబుతుంటే కూడా మన పాలకులు ఆదానితో చేసుకున్న షేకి ఒప్పందం రద్దు చేసుకోకపోవడం చాలా దారుణమని తక్షణమే ఆదానితో చేసుకున్న అన్ని రకాల ఒప్పందాలను రద్దు చేసుకోవాలని అధికారంలో లేనప్పుడు
యువ్వగలం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసిన నారా లోకేష్ స్మార్ట్ మీటర్లు ఎక్కడైనా రైతు మోటార్లకు బిగిస్తే పగలగొట్టండి అని చెప్పి ఆనాడు పాదయాత్ర సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. అదే నారా లోకేష్ ఇప్పుడు క్యాబినెట్ మంత్రిగా ఉండి మరి ఇప్పుడు ఎందుకు స్మార్ట్ మీటర్ల గురించి మాట్లాడడం లేదని పాలకుల విధానాల మాటలు పసిగట్టలేనంత కాలం పేద ప్రజలు మోసపోతూనే ఉంటారని కావున తక్షణమే పెరిగిన కరెంటు చార్జీలను ఉపసంభరించాలని ఆదానితో చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసుకోవాలని స్మార్ట్ మీటర్లు బిగించే విధానాన్ని మానుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు ఎస్ గిడ్డమ్మ ఎఐటియుసి నగర డిప్యూటీ కార్యదర్శి అంజి మహిళా సంఘం నగర నాయకులు సులోచనమ్మ ఆశా బేగం సోఫియా పావని నాగేంద్రమ్మ రబియా విజయ సువర్ణ
సిపిఎం ప్రజా సంఘాల నాయకులు రామకృష్ణ ఆనంద్ బాబు కె వి నారాయణ గురు శేఖర్ నగర కార్యదర్శి రాజశేఖర్ నగేష్ రామన్న తదితరులు ఈ భోగిమంటల కార్యక్రమం లో పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!