
ఎల్లార్తి దర్గా హుండీ లెక్కింపు
హొళగుంద,న్యూస్ వెలుగు:మండల పరిధిలో బుధవారం ఎల్లార్తి గ్రామంలో వెలసిన రాష్ట్రానికి ప్రసిద్ధి గాంచిన హాజరత్ శేక్షవలి,షాషావలి తాత దర్గా ఆవరణం నందు డిఎండబ్ల్యూఓ డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ సబిహా పర్వీన్ సమక్షంలో హుండీని లెక్కించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 4 నెలలకు సంబంధించి రూ.8 లక్షల 87 వేలు 5 వందల నగదు,20 వెండి గుర్రలు,దాదాపు రూ.2 లక్షల 50 వెలు డ్యామేజ్ నోట్లు వచ్చాయన్నారు.ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ సోహెల్,దర్గా ఈఓ ఇమ్రాన్,విఆర్ఓ ప్రహ్లాద, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!