
నిరుపేదలకు ఉపాధి పనులను కల్పించి,వలసలను అరికట్టాలి
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: రాష్ట్రవ్యాప్తంగా గల నిరుపేదలకు ఉపాధి పనులను కల్పించి వలసలను అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సభ్యులు తెలియజేశారు.సోమవారం రోజున మండల కేంద్రమైన తుగ్గలిలోని స్థానిక ఉపాధి హామీ కార్యాలయం నందు ఉపాధి హామీ పథకం ఏపీవో హేమ సుందర్ వారు మెమొరాండంను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2005లో తెచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం క్రమంగా పేదలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని,పనికి తగ్గ వేతనం అందడం లేదని,సమయానికి కూలీలకు వేతనాలు అందడం లేదని వారు తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం నిర్వీర్యం కాకుండా పేదలకు ఆర్థికంగా అండగా నిలవాలని ఫిబ్రవరి 13వ తేదీన జరిగే సదస్సును జయప్రదం చేయాలని వారు తెలియజేశారు.అదేవిధంగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ జాబ్ కార్డులు ఇవ్వాలని,రోజు వేతనం 600 ఇవ్వాలని, పని ప్రదేశంలో మెడికల్ కిట్లు టెంట్లు సరఫరా చేయాలని,పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి ఐదు లక్షలు ఇవ్వాలని,ఫీల్డ్ అసిస్టెంట్ లపై రాజకీయ వేదింపులు ఆగాలని,అవినీతి చేసిన వారిని తొలగించాలని, శ్రమ శక్తి సంఘాల మేటిలకు ఐదు రూపాయల పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారు ఏపీఓకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి శ్రీరాములు,హమాలీ సంఘం నాయకులు,గ్రామ రైతులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.