
ప్రజల భధ్రతకు భరోసా…
దొంగల ఆటకట్టించేందుకు …ఆధునిక సాంకేతికతో పోలీసింగ్
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్
• విజిబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యత.
• నేరస్తులు, అనుమానితుల వేలిముద్రలను వేగంగా ఖచ్చితత్వంగా సేకరిస్తాం.
• డిజిటల్ వేలిముద్రలతో నిందితులను సులభంగా కనిపెట్టేస్తాం.
కర్నూలు, న్యూస్ వెలుగు; సీఐడీలోని ఫింగర్ ప్రింట్స్ బ్యూరో విభాగం నుండి వచ్చిన 5 ఫింగర్ ఫ్రింట్ లైవ్ స్కానర్స్ ను, 8 మొబైల్ సెక్యూరిటి
చెక్ డివైజ్ పరికరాలను శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ పరిశీలించారు. ఈ సంధర్బంగా పలు పోలీసు స్టేషన్ పోలీసు అధికారులకు , సిబ్బందికి వాటి వినియోగం పై ఫింగర్ ఫ్రింట్ పోలీసు అధికారులతో కలిసి పలు సూచనలు చేశారు. ఈ పరికరాల వినియోగం పై అవగాహన కల్పించి అందజేశారు. ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..
గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దొంగల ఆటకట్టించేందుకు , నేరాల కట్టడికి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామన్నారు.
ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ల పోలీసులు వినియోగించే విధంగా అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.
ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం తో నేరస్తులు, అనుమానితుల వేలిముద్రలను వేగంగా ఖచ్చితత్వం సేకరిస్తామన్నారు.
డిజిటల్ గా వేలిముద్రలను భద్రత పరుస్తామన్నారు. .
విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా రాత్రి వేళల్లో, పగటి వేళల్లో జాతరలు, ఉత్సవాలు, బందోబస్తులలో , అనుమానిత ప్రాంతాలలో, గస్తీ విధులలో అనుమానితులను ఆరా తీసి , నేరస్తుల ను గుర్తించేందుకు ఈ సాంకేతికతను వినియోగిస్తారన్నారు.
నేర పరిశోధనకు అనువుగా లైవ్స్కానర్ వంటి పరికరాలు అందుబాటులోకి వచ్చాయన్నారు.
ఇది వరకే దొంగతనాలకు పాల్పడిన వారి నేరాల వివరాలు, ఫోటోలు, వేలి ముద్రలు ఇప్పటికే సాఫ్ట్ వేర్లో పొందుపర్చారన్నారు.
వీరు భవిష్యత్తులో ఎక్కడైనా ఎలాంటి నేరానికి పాల్పడినా వేలిముద్రల సాయంతో వెంటనే దొరికిపోయే అవకాశం ఉందన్నారు. ఎక్కడైనా నేరం జరగగానే కొత్తగా పట్టుబడిన నేరస్థుల వివరాలను, అక్కడ సేకరించిన వేలిముద్రలను ఎప్పటికప్పుడు సెంట్రల్ సర్వర్కు అనుసంధానం చేస్తారన్నారు .ప్రస్తుతం వేల మంది వేలిముద్రల్లో నిందితుల వేలిముద్రలను సరిపోల్చుకోవడం నిముషాల వ్యవధిలోనే పూర్తవుతోందన్నారు.
అనుమానితులను ఆరా తీయడంలో , విధుల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దని పోలీసు అధికారులకు సూచించారు.
ప్రస్తుత పరిస్ధితులల్లో నేరస్తులు కొత్త పధ్దతుల్లో చోరీలకు పాల్పడుతున్నారన్నారు.
నేరాల కట్టడికి ఆధునిక సాంకేతిక విధానం మంచి ఫలితాలను ఇస్తుందన్నారు.
నేర నియంత్రణ పై పటిష్ట నిఘా ఉంచి, ప్రజల భద్రతకు భరోస్తా కల్పిస్తామని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సిఐ తేజో మూర్తి, ఫింగర్ ప్రింట్ సిఐ పవన్ కుమార్ రెడ్డి, పత్తికొండ సిఐ జయన్న, ఎమ్మిగనూరు పట్టణ సిఐ శ్రీనివాసులు, ఆలూరు సిఐ వెంకటాచలపతి తదితరులు పాల్గొన్నారు.