
విజిబుల్ పోలీసింగ్ తో ప్రజల భద్రతకు భరోసా
కర్నూలు, న్యూస్ వెలుగు; విజిబుల్ పోలీసింగ్ ను మరింత బలోపేతం చేయాలని జిల్లా పోలీసులకు కర్నూల్ జిల్లావి ఎస్పీ శ్రీ క్రాంత్ పాటిల్
ఆదేశించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఈ రోజు కర్నూల్ పోలీసులు విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు.విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా వాహనాలు తనిఖీ చేపట్టి రోడ్డు భద్రత పై అవగాహన చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.ద్విచక్రవాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు .కార్ల డ్రైవర్లు సీటు బెల్టు వేసుకోవాలన్నారు.సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవింగులకు దూరంగా ఉండాలన్నారు. పరిమితికి మించి ప్రయాణీకులను ఆటోలలో తరలిస్తే చర్యలు తప్పవని సూచించారు. రహదారి భద్రత నియమాల ఉల్లంఘనలపై పోలీసులు చర్యలు చేపట్టారు.
Was this helpful?
Thanks for your feedback!