పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు భాగస్వాముల అవ్వాలి

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు భాగస్వాముల అవ్వాలి

న్యూస్ వెలుగు, కర్నూలు; పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కర్నూల్ సెంటర్ ఇన్చార్జ్ చంద్రశేఖర్,జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావులు అన్నారు. మంగళవారం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆవరణ నుండి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, కర్నూల్ సాయి సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా సైక్లింగ్ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా పోలీస్ రోయింగ్ పోటీలలో మెడల్ సాధించిన చంద్రశేఖర్ జండా ఊపి ప్రారంభించారు.అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ట్యూస్డే కార్యక్రమాన్ని రూపొందించారని అందులో భాగంగా కర్నూల్ నగరంలో పర్యావరణకు పరిరక్షించేందుకు సైక్లతాన్ ర్యాలీ నిర్వహించామన్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా సైక్లింగ్ చేస్తే ఆరోగ్యంతో పాటు ఫిట్నెస్ సాధించవచ్చు అని అన్నారు.అంతకు ముందు ర్యాలీ ని కర్నూల్ అవుట్డోర్ స్టేడియం నుంచి ప్రారంభమై పాత ఎస్పి బంగ్లా మీదుగా ఆర్ఎస్ రోడ్డుకు చేరుకొని అక్కడి నుండి కిడ్స్ వరల్డ్, పాత కంట్రోల్ రూమ్ కొండారెడ్డి బురుజు మీదుగుగా తిరిగి కర్నూలు అవుట్డోర్ స్టేడియం కు చేరుకొని ముగిసింది. కార్యక్రమంలో జిల్లా హ్యాండ్ బాల్ సంఘం కార్యదర్శి డాక్టర్ రుద్ర రెడ్డి,హ్యాండ్ బాల్ శిక్షకులు జితిన్ సింగ్, టైక్వాండో శిక్షకుడు కార్తికేయ, డి.ఎస్.ఎ శిక్షకులు కాశీరావు,యౌసఫ్ భాషా, తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!