
ప్రతి ఒక్కరూ కుటుంబసభ్యులతో పండుగ జరుపుకోవాలి
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పి మురళీకృష్ణ
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు పార్టీ అభిమానులకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మాజీ సభ్యులు. పి మురళీకృష్ణ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని పారద్రోలి వెలుగులు ఇచ్చే పండుగ దీపావళి అని, ఈ పండుగను ప్రతి ఒక్కరూ కుటుంబసభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని, ముఖ్యంగా బాణసంచా పేల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని పేలుడు వస్తువులకు పిల్లలను దూరంగా ఉంచాలని ప్రమాదం జరిగిన తరువాత బాధపడేకంటే జరగకుండా చూసుకోవడం మంచిదని మురళీకృష్ణ విజ్ఞప్తి చేశారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist