
హైదరాబాదులో సినీ నటులు సాయి కుమార్ ను కలిసిన సినీ నిర్మాత తోక వెంకటేష్ చిత్ర బృందం
హోళగుంద,న్యూస్ వెలుగు: నూతన చిత్ర నిర్మాణానికై ప్రోడక్షన్ నెంబర్-1లో భాగంగా నటీనటులను సినీ నిర్మాత తోక వెంకటేష్ మరియు డైరెక్టర్ అజయ్ సూర్య సంప్రదించారు.ఇందులో భాగంగా శనివారం సీనియర్ నటులు డైలాగ్ కింగ్ సాయికుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి సాయికుమార్ 50 వసంతాల దిగ్విజయ సీనిప్రయాణం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.తదనంతరం సినీ నిర్మాత తోక వెంకటేష్ మరియు దర్శకుడు అజయ్ సూర్య మాట్లాడుతూ తమ నూతన సినిమాలో నటనకై డైలాగ్ కింగ్ సాయికుమార్ సంప్రదించగా ఆయన సానుకూలంగా స్పందించడమే కాక సినిమా నిర్మాణం గూర్చి విలువైన సలహా,సూచనలను చేస్తూ సినిమా మెలుకువలు తీసుకువాల్సిన జాగ్రత్తలు తదితర విషయాలను క్షుణ్ణంగా వివరించారన్నారు.ఇప్పటికే సినిమా బృందం లొకేషన్స్,తదితర సినీ కార్యకలాపాలను పూర్తి చేసుకున్నదని సినిమా టైటిల్ మరిన్ని పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సినీ యూనిట్ సభ్యులు ఎరిగేరి వీరేష్,ఖాదర్ బాష,గోవర్ధన్,కుప్పగల్లు శీను,నాగేష్,రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు.