
డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు
న్యూస్ వెలుగు, కర్నూలు; నగరంలో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అన్నారు. సోమవారం లక్ష్మిపురం, రోజా స్ట్రీట్, వెంకటమణ కాలనీల్లో కమిషనర్ పర్యటించారు. ఆయా కాలనీల్లో డ్రైనేజీ, పైప్లైన్ లీకేజీకి సంబంధించిన ప్రదేశాలను పరిశీలించారు. లక్ష్మిపురంలో నీటి సరఫరాపై ఆరా తీశారు. అదేవిధంగా వెంకటరమణ కాలనీలోని దాదాపు పూర్తైన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టి.జి. భరత్ క్యాంపు కార్యాలయ ఆధునికీకరణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఆరోగ్యధికారి డా. కె.విశ్వేశ్వర్ రెడ్డి, ఎస్ఈ రాజశేఖర్, డిఈఈ గంగాధర్, ఏఈ నాగజ్యోతో, శానిటేషన్ ఇంస్పెక్టర్ మునిస్వామి, తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!