
మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ యలమంచి శ్రీరాములు అనారోగ్యంతో మృతి
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని గల ఉప్పర్లపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ యలమంచి శ్రీనివాసులు శుక్రవారం రోజు అనారోగ్యంతో మృతి చెందాడు.టిడిపి సీనియర్ నాయకుడిగా పార్టీలో ఉంటూ పార్టీ కోసం ఎంతో కృషి చేశారు.మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా ఆయన ప్రజలకు సేవలందించారు. ఆయన మృతి పట్ల మండల పరిధిలోని గల తెలుగుదేశం పార్టీ నాయకులు టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకటరాముడు,మాజీ ఎంపీపీ కొమ్ము వెంకటేష్,మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు, ఉపాధ్యక్షుడు వెంకటరాముడు చౌదరి, అప్పా వేణు,నీలా ప్రసాద్,నీలా మనోహర్,మాజీ సర్పంచ్ శ్రీనివాసులు గౌడ్,ఈశ్వరయ్య,రాము నాయక్ తదితర మండల టిడిపి నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఆయనకు నివాళులర్పించారు.
Was this helpful?
Thanks for your feedback!