
ఏపీసీసీ కార్యాలయం పై దాడి చేయడం బిజెపి గుండాలకు తగదు మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు
న్యూస్ వెలుగు కర్నూలు : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయం పై బిజెపి గూండాలు దాడి చేయడం తగదని మాజీ ఎమ్మెల్సీ, మాజీ డిసిసి అధ్యక్షులు ఎం సుధాకర్ బాబు ప్రశ్నించారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పత్రికా ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పై దాడి జరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వానికి అవమానకరమని గతంలో రాష్ట్ర టిడిపి ఆఫీస్ పైన దాడి చేస్తే చంద్రబాబు ఏ విధమైన చర్యలు తీసుకున్నావో ఎవరెవరి పైన కేసులు పెట్టారో అదే రీతిలో రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం పై దాడి చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని కూటమి కార్యకర్తలని వదిలేస్తే పర్యవసానం మరో విధంగా ఉంటుందని తెలియజేశారు. పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిల రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. గతంలో మోడీ వస్తే నల్ల దుస్తులతో నిరసన తెలిపిన మీరు ఈరోజు మోడీతో అంట కాగుతున్నారని ప్రజల పక్షాన మాట్లాడితే గొంతు నొక్కి అరెస్టులు చేస్తున్నారని మీరు రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంపై, పిసిసి అధ్యక్షురాలు పైన దాడి చేసిన వారిపై సీసీ ఫుటేజీల ఆధారంగా రెండు కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని సుధాకర్ బాబు గారు డిమాండ్ చేశారు. అనంతరం కోడుమూరు కోఆర్డినేటర్ అనంతరత్నం మాదిగ మాట్లాడుతూ కార్మికులకు అందరికీ మే డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం పైన, పిసిసి అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి గారి పైన కార్యకర్తలపైన దాడులు చేయడానికి బిజెపి కార్యకర్తలు ప్రయత్నించారని ప్రధాని రాక సందర్భంగా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిలా రెడ్డి గారు 2014లో రాజధాని కట్టిస్తానని చెప్పి ఏపీలో గంగాజలం, అయోధ్య మట్టి వేశావని, ఈసారైనా రాజధాని కడతారా లేదా అని ప్రశ్నిస్తే బిజెపి యువమోర్చ కార్యకర్తలు రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం పై షర్మిల రెడ్డి గారిపై దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎవరైనా ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పించిందని దాడి చేసిన వారి పైన తక్షణమే కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని అనంతరత్నం మాదిగ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ ఎన్ సి బజారన్న, బీసీ సెల్ చైర్మన్ డివి సాంబశివుడు, జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్, కాంగ్రెస్ నాయకులు ఖాద్రి పాషా, రియాజుద్దీన్, బి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.