ఫిబ్రవరి 5న వైయస్సార్సీపి “ఫీజుపోరు పోస్టర్” ఆవిష్కరించిన నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి

ఫిబ్రవరి 5న వైయస్సార్సీపి “ఫీజుపోరు పోస్టర్” ఆవిష్కరించిన నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి

నంద్యాల, న్యూస్ వెలుగు; శుక్రవారం  నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి కార్యాలయం నందు విద్యార్థి విభాగం నాయకులు  వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి వైఎస్ఆర్సీపీ “ఫీజుపోరు” పోస్టర్ ఆవిష్కరించారు.. విద్యార్థుల పక్షాన అండగా నిలుస్తూ చంద్రబాబు సర్కార్ పై నిరసనగా ఫిబ్రవరి 5న విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి నంద్యాలోని ఉదయానంద హోటల్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి విద్యార్థి మరియు విద్యార్థి తల్లిదండ్రులు మరియు వైఎస్సార్ సీపీ నాయకులు అందరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు మరియు వైఎస్ఆర్సిపి అనుబంధం విభాగాల జిల్లా మరియు మండల అధ్యక్షులు మరియు వైయస్సార్సీపీ కార్పొరేటర్లు,నాయకులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!