
భారత దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్
క్రాంతి నాయుడు, పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి.
పత్తికొండ/ తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: భారత ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించి, భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసినటువంటి మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అని పత్తికొండ కాంగ్రెస్ కమిటీ ఇంచార్జి క్రాంతి నాయుడు న్యూస్ వెలుగు పత్రికా విలేకరితో తెలిపారు. మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆకస్మిక మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆర్థిక నిపుణులు, దేశ, రాష్ట్ర రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అని అన్నారు. ఈ దేశానికి రెండు సార్లు ప్రధానమంత్రి గానే గాక ఆర్బీఐ గవర్నర్ గా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, కేంద్ర ఆర్థిక మంత్రి గా భారతదేశం ఆర్థికంగా నిలదుక్కోవటంలో, ప్రపంచంలోమూడవ ఆర్థిక శక్తిగా ఎదగడంలో మన్మోహన్ సింగ్ గారి పాత్ర మరచిపోలేనిదని, ఈ దేశ ప్రధానిగా మూడు కోట్ల మంది రైతుల రుణమాఫీ ఒకే విడతలో చేసిన ఘనత మన్మోహన్ సింగ్ కె చెందుతుందని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, విద్యా హక్కు చట్టం తో పాటు దాదాపు 14 రకాల చట్టాలను సామాన్యులకు, పేద, బడుగు, బలహీన వర్గాలకు అందుబాటులోకి తీసుకొని వచ్చి చరిత్రలో నిలిచిపోయారని, ఆయన మృతి ఈ దేశానికి, కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ తీరని లోటుగానే ఉంటుందని అని అన్నారు. రానున్న ఏడు రోజులు సంతాప దినాలుగా పార్టీ ప్రకటించింది అని, పార్టీ కార్యక్రమాలు వాయిదా వేయడం జరిగింది, పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈసారి నిర్వహించడం లేదు అని కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గం కమిటీ ఇన్చార్జి క్రాంతి నాయుడు ఈ సందర్భంగా న్యూస్ వెలుగు పత్రిక ప్రతినిధితో తెలియజేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గం కమిటీ ఇన్చార్జి క్రాంతి నాయుడు తో పాటు పత్తికొండ నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.