
రవాణా శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఉచిత మెగా వైద్య శిబిరం
డిటిసి ఎస్ శాంత కుమారి
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు నగరం లోని జిల్లా గ్రంథాలయంలో 36 వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమారి ఆదేశాల మేరకు. ఆర్టీవో భరత్ చావన్ పర్యవేక్షణలో ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ల కె రవీంద్ర కుమార్, ఎస్ నాగరాజ నాయక్, సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇ
న్స్పెక్టర్ బాబు కిషోర్, ఆధ్వర్యంలో బుధవారం జిల్లా గ్రంథాలయంలో డ్రైవర్లకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు, ఈ కార్యక్రమాన్ని మదర్ తెరిసా ఇంటిగ్రేట్ నేషనల్ డెవలప్మెంట్ సొసైటీ సంస్థ మరియు మైండ్స్ స్వచ్ఛంద సేవ సంస్థ సహకారంతో మాజీ జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి, మదర్ తెరిసా సొసైటీ సంస్థ ప్రెసిడెంట్ ఎల్ దౌమని, మెడికవర్ ఆసుపత్రి, శాంతి రామ్ కంటి ఆసుపత్రి, రోజా స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్, వారిచే ఈ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కర్నూల్ ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీపీ షుగర్ ఈ సి జి కంటి చెవి మరియు కంటి పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమారి మాట్లాడుతూ, జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు జరగబోయే రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా రహదారి భద్రతలో తీసుకోవలసిన జాగ్రత్తలపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. డ్రైవర్లు తమ యొక్క ఆరోగ్య స్థితి గతులను దృష్టిలో ఉంచుకొని బీబీ షుగర్ కంటి పరీక్షలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉంచుకోవాలని తెలిపారు. ఆరోగ్య పరిస్థితులు చక్కగా ఉండడం వల్ల వారితో ప్రయాణిస్తున్నటువంటి వాహనంలోని ప్రయాణికుల రక్షణ చక్కగా చూసుకుంటూ వాహనం నడపాలని తెలిపారు. గోల్డెన్ అవర్ అంటే ప్రమాదం జరిగినప్పుడు ఒక గంట సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారని అన్నారు వాహనం ప్రమాదం జరిగినప్పుడు ప్రధమ చికిత్స చేసి వారిని త్వరితగతిన వైద్యశాలకు తీసుకోని పోవడం వల్ల ప్రాణాలు రక్షించడానికి అవకాశం ఎక్కువగా ఉందని ఆమె పేర్కొన్నారు, ప్రమాదం జరిగినప్పుడు భయపడకుండా క్షతగాత్రులను సరైన సమయంలో వైద్యశాలకు తీసుకెళ్లడం వల్ల మీపై ఎలాంటి కేసులు కేసులు పెట్టడం జరగదని మరియు కోర్టుకు పిలవడం ఉండదన్నారు. కేంద్ర ప్రభుత్వం గుడ్ సమ్మర్టన్ యాక్ట్ కింద తగిన విధంగా గౌరవించడం మరియు ఐదువేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా ఆర్టీవో భరత్ చవాన్, మాట్లాడుతూ డ్రైవర్లు వైద్య పరీక్షలు తప్పనిసరి విధి ఆరు నెలలకు కండిషన్ బట్టి ఆరోగ్యపరీక్షలు చేసుకోవాలని కంటి పరీక్షలు బీపీ షుగర్ తప్పనిసరిగా పరీక్షించుకోవాలి, అలాగే తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఫేస్ వాష్ అండ్ మూ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మొఖం కడుక్కొని ప్రయాణం చేయడం వల్ల నిద్ర మత్తు వదిలి రోడ్డు మీద జాగ్రత్తగా నడపడానికి వీలవుతుందని తెలిపారు. అలాగే మంచి అలవాట్లు కలిగి ఉండాలని అన్నారు, వాహనం నడిపేటప్పుడు, సెల్ఫోన్లో మాట్లాడడం వాహనం నడుపుతూ వేరే ఆలోచనలో ఉండకూడదని తెలియజేశారు. కర్నూల్ ట్రాఫిక్ సిఐ మనసురుద్దీన్, లు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాదారులు లైసెన్స్ కలిగి ఉండి మోటార్ సైకిల్ నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. నాలుగు చక్రాల వాహనదారులు లైసెన్స్ కలిగి ఉండి తప్పనిసరిగా సీట్ బెల్ట్ ను ధరించాలి, మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. అధిక వేగం రాష్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమన్నారు ముఖ్యంగా వాహనాదారులు సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం ఎంతో ప్రమాదకరమన్నారు. వాహనాదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ సి బుక్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా వాహనాల్లో ఉంచుకొని వాహనాలు నడపాలని ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దిన్ తెలిపారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో పెద్ద సంఖ్యలో డ్రైవర్లు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దిన్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రవీంద్ర కుమార్, నాగరాజ నాయక్, సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు బాబు కిషోర్ గణేష్ బాబు, డాక్టర్ జైన్, డాక్టర్ అబ్దుల్ రహీం, డాక్టర్ అహ్మద్, డాక్టర్ కౌసర్, మరియు హాస్పటల్ సిబ్బంది, మరియు లారీ యూనియన్ నాయకులు మరియు ఆటో నాయకులు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.