
పవిత్ర గుడిలో జూదం,అశాంఘిక శక్తులకు అడ్డాగా మారిందా?
రాజుపాలెం: సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలంలోని పోలీస్ వ్యవస్థ నిద్రమత్తులో వ్యవహరిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాలు ప్రకారం.రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామంలోని పవిత్రమైన బ్రహ్మంగారి దేవాలయంలో రాత్రినక, పగలనక జిగ్గాట పేకాటకు అసాంఘిక శక్తులకు నిలయంగా మారింది. పవిత్ర దేవాలయం పక్కన ఎక్కడబడితే అక్కడ మత్తు పదార్థాలు, నిషేధిత పదార్థాలు అమ్ముతూ, టీ కొట్టును కూడా బెల్ట్ షాపులు గా మార్చేశారు.గతంలో రాజుపాలెం పోలీస్ స్టేషన్ లో దేవస్థానంలో పేకాట ఆడుతున్నారని గతంలో ఎంతోమంది ఫిర్యాదు చేసిననప్పటికి పట్టించుకునే నాధుడు లేడు, నూతనంగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ పవిత్రమైన దేవాలయంలో అసాంఘిక శక్తులు ప్రవేశించకుండా కట్టడి చేయాలని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, పవిత్రమైన దేవాలయంలో ప్రజలు పూజలు నిర్వహించేలా రాజుపాలెం పోలీస్ శాఖ శ్రద్ధ చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.