
గాంధీ చూపిన మార్గం ప్రపంచానికి ఆదర్శం
వాడి వేడిగా ముగిసిన గ్రామసభ
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో బుధవారం స్థానిక మేజర్ గ్రామ పంచాయితీ కార్యాలయం నందు సర్పంచ్ చలువాది రంగమ్మ అధ్యక్షతన,కార్యదర్శి రాజశేఖర్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ,లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ముందుగా స్వచ్చత హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా సచివాలయం,రహదారుల్లో చెత్తను ఊడ్చి పరిశుభ్రం చేశారు.మరియు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రీన్ అంబాసిడర్లను శాలువ పూలమాలలతో సన్మానించారు.అనంతరం గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ గాంధీజీ కలలు సాకారం కావాలంటే గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్నారు. స్వాతంత్ర్య సమరంలో ఆయన అనుసరించిన అహింసా వాదం,ఆలోచనలను,సిద్ధాంతాలను,లాల్ బహుదూర్ శాస్త్రి ధైర్య సహసాలను కొనియాడారు.అలాగే యువత ఈ మహనీయులు చూపిన మార్గంలో నడవాలని సూచించారు.అనంతరం మాజీ సర్పంచ్లు రాజా పంపన్న గౌడ,డాక్టర్ తిప్పయ్య మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సిసి రోడ్డు,డ్రైనేజ్ నిర్మాణ పనుల పై దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.మరియు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో అర్హులైన వారిని ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశారు.వార్డు సభ్యులు చిన్న మల్లయ్య మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న వెలంలా బకాయిలను సత్వరమే వసూలు చేసీ గ్రామ పంచాయతీకి సమకూర్చచాలన్నారు.అదేవిధంగా ప్రజలు తమ తమ సమస్యలు పరిష్కరించాలని వినంతి పత్రాలను సమర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజా పంపన గౌడ్ గ ఆర్ జి ఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ మంజునాథ్,వెలుగు ఏపిఎం హనుమంతు,టిడిపి,బిజెపి మండల కన్వీనర్లు డాక్టర్ తిప్పయ్య,ప్రసాద్,బిజెపి నేషనల్ కౌన్సిల్ మెంబర్ చిదానంద,వార్డు సభ్యులు చిన్న మల్లయ్య,శంకర్ మల్లయ్య,వైస్ ఎంపిపి భర్త హనుమప్ప,సర్పంచ్ తనయుడు పంపాపతి,కూటమి పార్టీ నాయకులు వీరేష్,కార్యకర్తలు,సచివాలయం సిబ్బంది,పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.