
లక్ష్మీదేవి అమ్మవారికి వెండి చేతి తొడుగులు బహుకరణ
బండి ఆత్మకూరు, వెలుగు న్యూస్: మండలంలోని ఏ కోడూరు గ్రామంలోని చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఉన్న లక్ష్మీదేవి అమ్మవారికి బుధవారం మండల అధ్యక్షుడు దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి సోదరుడు పెద్ద సంజీవరెడ్డి వెండి చేతి తొడుగులు బహుకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం 1.60వేల రూపాయల విలువగల ఒకటిన్నర కేజీ వెండి తొడుగులను దేవదాయ కమిషనర్ మోహన్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!