
వైభవంగా గజోత్సవం
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో స్థానిక కొండ గుహలో స్వయంభువుగా వెలసిన శ్రీ సిద్దేశ్వర స్వామీ గజోత్సవం గురువారం రమణీయంగా జరిగింది.అలాగే ఉదయం నుంచి స్వామి వారి సన్నిధిలో ఆలయ ధర్మకర్త హెచ్.రాజపంపన్న గౌడ,భారత్ యూత్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు శివశంకర్ గౌడ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అభిషేకం,కుంకుమార్చన, ఆకుపూజ,పెద్ద ఎత్తున పూల మాలలతో స్వామి వారిని అలంకరించారు.సాయంత్రం 6:30 నిమిషాలకు గజోత్సవం సందర్భంగా తేరు బజారు ప్రాంగణం చిన్నారుల జయ జయ ధ్వనులతో మారుమోగింది.
Was this helpful?
Thanks for your feedback!