
ఘనంగా జరిగిన గోల్డ్ మైన్స్ సదస్సు
తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలం పరిధిలోని పగిడిరాయి మరియు జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రవేట్ జియో మైసూర్ గోల్డ్ మైన్ వారి సారథ్యంలో పర్యావరణ పరిరక్షణ సదస్సు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సులో రైతులు వారి పర్యావరణ సమస్యలను తెలియచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా జియో మైసూర్ గోల్డ్ మైన్ సంస్థ సిబ్బంది, పత్తికొండ డివిజన్ రెవిన్యూ డిపార్ట్మెంట్ అధికారులు, తుగ్గలి మండల రెవిన్యూ అధికారులు,ప్రజా ప్రతినిధులు,పత్తికొండ పోలీస్ యంత్రాంగపు సిబ్బంది, తుగ్గలి మండల పోలీస్ సిబ్బంది,వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు రైతులు మహిళలు,ప్రజా సంఘాల నేతలు,తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist Pinjari Imamulu
 Journalist Pinjari Imamulu