మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది

మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది

  వక్ఫ్ ఆస్తులను సత్ప్రయోజనాల కోసం వినియోగించాలి

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మైనారిటీ అఫైర్స్ ఎం.ఎ.షరీఫ్

కర్నూలు, న్యూస్ వెలుగు;  మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మైనారిటీ అఫైర్స్ ఎం.ఎ.షరీఫ్ పేర్కొన్నారు..బుధవారం స్థానిక సంతోష్ నగర్ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలోని ఎపి.మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ తో కలసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మైనారిటీ అఫైర్స్ పరిశీలించారు..ఈ సందర్భంగా విద్యార్థులతో సంభాషించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికీ ఆరు రెసిడెన్షియల్ పాఠశాలలను పరిశీలించడం జరిగిందని, వాటితో పోలిస్తే సంతోష్ నగర్ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల లో చక్కని వసతి సదుపాయం, గ్రౌండ్, క్లాస్ రూమ్స్ ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారు. వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు..సంతోష్ నగర్ లోని బుడ్డా బుడ్డి మసీదుకు (వక్ఫ్ ఆస్తి) సంబంధించి దాతలు దానం ఆరు ఎకరాల భూమిలో నిర్మించిన మైనార్టీ పాఠశాల ఏర్పాటు చేయడం చాలా సంతోషం అని అన్నారు. వక్ఫ్ భూములను ఇలాగే సత్ప్రయోజనాల కోసం వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
విద్యతోనే మనిషి నాగరికతతో పాటు సంపూర్ణమైన జీవితం గడపగలుగుతారన్నారు. విద్యార్థులు పేదరికాన్ని శిక్షగా భావించకుండా విద్య ద్వారా ఉన్నత శిఖరాలకు అధిరోహించేలా కృషి చేయాలన్నారు.. రాజ్యాంగ రూపకర్త డా.బిఆర్.అంబేద్కర్ కూడా పేదరికం నుండే ఉన్నత స్థాయికి రావడం జరిగిందన్నారు. తల్లితండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తుంటారని, కలలను సాకారం చేసేలా విద్యార్థులు కృషి చేస్తూ పోటీతత్వంతో మంచి మార్కులు సాధించాలన్నారు. పదవ తరగతి పునాది కాబట్టి మంచి మార్కులు సాధించేలా బాగా చదవాలని విద్యార్థులను ప్రోత్సహించారు.. చూడాలన్నారు. ముస్లిమ్స్ మాత్రమే కాకుండా అందరూ ఉర్దూ భాషను నేర్చుకోవడం వల్ల అదనపు అర్హత పరిగణించే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంతోష్ నగర్ పాఠశాల ప్రహరీ గోడ, డైనింగ్ హాల్ తదితర వసతులను ఏర్పాటు చేస్తానని ఆయన తెలిపారు.. పంచలింగాల ఎపి.మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు..
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ సంతోష్ నగర్ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో గ్రౌండ్, ఇతర వసతులు చాలా వరకు బాగున్నాయని, డార్మెటరీ, కిచెన్, డైనింగ్ హాల్, కాంపౌండ్ వాల్ ల నిర్మాణానికి ఎస్టిమేట్లు తయారుచేసి ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. పాఠశాల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు..సంతోష్ నగర్ పాఠశాలలో చాలా సంవత్సరాల నుండి వంద శాతం ఉత్తీర్ణత ఉందని, మార్కులు కూడా చాలా బాగా వచ్చాయన్నారు..అదే విధంగా ఈ ఏడాది కూడా పదవ తరగతి విద్యార్థులు అందరూ బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలన్నారు.. ధనవంతులకు ఆస్తి డబ్బు, పొలాల్లో ఉంటుందని, పేదరికంలో ఉన్న తల్లిదండ్రుల పిల్లలకు ఆస్తి కేవలం చదువు మాత్రమే అని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.. చదువు ఒక ఆయుధం లాంటిదని, బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకున్నట్లైతే కుటుంబానికి ఆసరాగా నిలుస్తారని, పది మంది పేద విద్యార్థులకు సాయం చేసే స్థాయికి ఎదగాలని కలెక్టర్ విద్యార్థులను ఉత్తేజితులను చేశారు..పంచలింగాల గ్రామంలోని బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలకి సంబంధించి దిన్నెదేవరపాడులో నిర్మిస్తున్న భవన నిర్మాణం బేస్మెంట్ స్థాయి వరకు వచ్చి ఆగిపోయిందని ప్రిన్సిపల్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఇందుకు సంబంధించిన వివరాలతో డిఓ లేఖను తయారు చేయాలని కలెక్టర్ మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు.. బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో సిసి టీవీ కెమెరాల ఏర్పాటుకి ఎస్టిమేట్ లను సిద్ధం చేయాలని కలెక్టర్ మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు..కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, డిఎస్పీ మహబూబ్ బాషా, మైనార్టీ సంక్షేమ అధికారి సబిహా పర్వీన్, కల్లూరు తహశీల్దార్ ఆంజనేయులు, కర్నూలు రూరల్ తహశీల్దార్ రమేష్ బాబు, పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!