
ప్రభుత్వ భూములను కాపాడాలి
డోన్, న్యూస్ వెలుగు; డోన్ లోని ప్రభుత్వ భూములు కబ్జాలకు గురి అవుతున్నాయని, అయితే అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఇప్పటికే కొన్ని 100 ల ఎకరాల ప్రభుత్వ భూములు, వంక భూములు, మున్సిపాలిటీకి సంబంధించిన భూములు కబ్జాలకు గురయ్యాయని నంద్యాల కలెక్టరేట్ ఎదుట డోన్ ఎన్ ఎస్ యు ఐ నాయకులు తెలుగు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆందోళన చేసి అనంతరం కలెక్టర్ గారికి ప్రజా దర్బారులో వినతి పత్రం అందజేయడం జరిగింది..
అనంతరం ఎన్ ఎస్ యు ఐ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు తెలుగు విజయ్ కుమార్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా డోన్ లోని ప్రభుత్వ భూములను కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది అధికారులతో కుమ్మక్కై వందల ఎకరాలను కబ్జా చేసి వెంచర్లు వేసి అమ్ముకుంటూ తమ జేబులు నింపుకుంటున్నారని, అయితే ఉన్నత అధికారులు మాత్రం ఇటువంటి వాటిపైన చర్య తీసుకోకపోవడం వల్ల రాబోయే రోజుల్లో డోన్ లో ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను ఏర్పాటు చేయటానికి కూడా స్థలం లేకోకుండా పోయిందని. అయితే ఇప్పటికే సెంట్రల్ స్కూల్ కు సంబంధించి భవనం ఏర్పాటుకు స్థలం లేనందున సెంట్రల్ స్కూల్ కూడా రద్దయ్యే అవకాశం ఉందని, ఎస్సీ బాయ్స్ గురుకుల స్కూలు కూడా పట్టణంలో ప్రభుత్వ భూమి లేనందున ఎక్కడో ఊరి బయట ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, అయితే డోన్ పట్టణంలోనే సర్వే నంబర్ 503 లో 8 ఎకరాల 51 సెంట్ల ప్రభుత్వ భూమి ఉందని ఇందులోనే ఎస్సీ గురుకుల బాయ్స్ స్కూల్ ను ఏర్పాటు చేయాలని, డోన్ పట్టణంలోని మున్సిపాలిటీకి సంబంధించిన కళ్యాణ్ ఎస్టేట్లోని పిల్లలకు ఆట స్థలానికి కేటాయించినటువంటి పార్కు స్థలాన్ని సర్వే నంబర్ 380/B లో 65 సెంట్ల మున్సిపాలిటీ స్థలాన్ని కూడా కబ్జా చేసి అక్రమ కట్టడాలు కట్టారని ,ఇలా ఎన్నో ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ అవన్నీ కబ్జాకి గురి కావడం వల్ల రాబోయే రోజుల్లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఎటువంటి ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ హాస్టల్లో ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ఇప్పటికైనా ఉన్నతాధికారులు కబ్జా గురైనటువంటి ప్రభుత్వ భూములను మరి వాటిలో నిర్మించినటువంటి అక్రమ కట్టడాలను తొలగించి ప్రభుత్వ పరం చేయాలని లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతామని వారు హెచ్చరించారు..
కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ నాయకులు ప్రతాప్, విగ్నేష్, శ్రీరామ్, రాజు , నాయక్ తదితరులు పాల్గొన్నారు..