రీ సర్వే తప్పిదాలను సరి చేసేందుకే గ్రామ సభలు

హోళగుంద,న్యూస్ వెలుగు: భూ రీ సర్వేలో జరిగిన తప్పిదాలను సరి చేసేందుకే ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తుందని తహసిల్దార్ సతీష్ కుమార్ అన్నారు.శనివారం మండల పరిధిలోని ఎండీ హల్లి గ్రామంలో సర్పంచ్ సుధాకర్ ఆధ్వర్యంలో రెవిన్యూ గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రీ సర్వేలో రైతుల పొలాల విస్తీర్ణంలో ఏమైనా తప్పిదాలు జరిగి ఉంటే సంబంధిత ఆధారాలతో వినతి పత్రం ద్వారా అందజేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ నిజాముద్దీన్,రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ ముకుందరావు,వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!