
జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పి మురళీకృష్ణ
కర్నూలు, న్యూస్ వెలుగు; ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మాజీ సభ్యులు పి మురళీకృష్ణ తెలియజేశారు. ఈ రోజు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభదినమని రాజ్యాంగ నిర్మాణ కమిటీ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ భారత రాజ్యాంగాన్ని రచించారని, భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పధ్ధెనిమిది రోజులు పట్టిందని, భారత రాజ్యాంగం 1950 జనవరి 26 వ తేదీన అమలులోకి వచ్చిందని భారతీయులకు స్వేచ్ఛా ఫలాలను అందించిన దేశనాయకులను స్మరించుకోవాలని ఆశయాలకు అనుగుణంగా శాంతి అహింసలకు కట్టుబడి సోదరభావంతో మెలగాలని ప్రతి భారతీయుడు దేశ నిర్మాణానికి కృషి చేయాలని, రాజ్యాంగాన్ని గౌరవించాలని ఈ రోజు 76 వ భారత గణతంత్ర దినోత్సవం సందర్బంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మురళీకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ముందుగా పార్టీ కార్యాలయం నుండి నాయకులు కార్యకర్తలు బయలుదేరి స్థానిక కొండారెడ్డి బురుజు వద్ద గల గాంధీ పార్కు నందలి జాతిపిత మహాత్మా గాంధీ చిత్ర పటమునకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం ముందు డీసీసీ అధ్యక్షులు పి మురళీకృష్ణ జాతీయ పతాకమును ఎగురవేసి జాతీయ గీతముతో వందన సమర్పణ గావించారు. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ ఎన్ సి బజారన్న, ఓ బి సి జిల్లా చైర్మన్ డివి సాంబశివుడు, ఐఎన్టీయూసీ అధ్యక్షులు బి బతుకన్న ప్రధాన కార్యదర్శి ఎన్ సుంకన్న జిల్లా మహిళా కాంగ్రెస్ ఎస్ ప్రమీల కాంగ్రెస్ నాయకులు షేక్ ఖాజా హుస్సేన్, ఎన్ చంద్రశేఖర్, కురువ నాగశేషు, బి సుబ్రహ్మణ్యం, కే రాఘవేంద్ర రెడ్డి, అనంతరత్నం మాదిగ, ఈ లాజరస్, ఖాద్రిపాషా, రాజేంద్రప్రసాద్, ప్రతాపరెడ్డి, రమేష్ జయకుమార్, ఆర్ విక్టర్, అక్బర్, రంగస్వామి, ఐ ఎన్ టి సి నాయకులు ఆర్ ప్రతాప్, జేమ్స్, గోవిందు, ఆశీర్వాదం, మహిళా కాంగ్రెస్ లలిత, మల్లేశ్వరి శ్రీలత ఎల్లమ్మ మొదలగువారు పాల్గొన్నారు.