
ప్రజలు సంతృప్తి పొందేలా ఫిర్యాదులను పరిష్కరించాలి
లాగిన్ లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ వెలుగు; ప్రజలు సంతృప్తి పొందేలా ఫిర్యాదులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్) కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు..పిజిఆర్ఎస్ లాగిన్ లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. ఎట్ టు వ్యూ ఆప్షన్ కింద మండల సర్వేయర్, హాలహర్వి వద్ద 58 రోజులుగా దరఖాస్తును ఇంత వరకు ఓపెన్ చేసి చూడలేదని సంబంధిత సర్వేయర్ పై చర్యలు తీసుకోవాలని సర్వే ఎడి ని కలెక్టర్ ఆదేశించారు. అలాగే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కు సంబంధించిన దరఖాస్తు ఏడు రోజులుగా పెండింగ్ లో ఉందని, కార్మిక శాఖ లాగిన్ లో గత 15 రోజులుగా ఒక దరఖాస్తు ఇంతవరకు ఓపెన్ చేసి చూడలేదని, వచ్చే ఒకటి, రెండు అర్జీలు కూడా ఓపెన్ చేసి చూడకపోతే ఎలా కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు. ఓర్వకల్లు తహశీల్దార్ లాగిన్ లో 49 రోజులుగా ఒక దరఖాస్తు పెండింగ్ ఉందని, డిసిసి బ్యాంకు సిఈఓ లాగిన్ లో 8 రోజులుగా ఒక దరఖాస్తు పెండింగ్ ఉందని త్వరితగతిన పరిష్కరించాలని, జెడ్ఎం ఎపిఐఐసి లాగిన్ లో 7 రోజులుగా ఒక దరఖాస్తు పెండింగ్ లో ఉన్నాయని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. లాగిన్ లో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఓపెన్ చేసి చూడాలని, గడువు లోపు అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.రీఓపెన్ కేసులకు సంబంధించి 96 అర్జీలు రీఓపెన్ అయ్యాయని, అందులో పత్తికొండ ఆర్డీఓ వద్ద 35, సబ్ కలెక్టర్ ఆదోని వద్ద 27 ఉన్నాయని వాటిని నాణ్యతతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
సిఎంఓ గ్రీవెన్స్ లకు సంబంధించి ఆర్డీఓ కర్నూలు వద్ద 18, పత్తికొండ ఆర్డీఓ వద్ద 12, సబ్ కలెక్టర్ ఆదోని వద్ద 10, వ్యవసాయ అధికారి వద్ద 2, జిల్లా రిజిస్ట్రార్, సివిల్ సప్లైస్ డిఎస్ఓ, డ్వామా వద్ద ఒక్కొక్క దరఖాస్తు చొప్పున పెండింగ్ లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, ఇంఛార్జి డిఆర్ఓ బికె.వెంకటేశ్వర్లు, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.