ప్రజలకు ఇచ్చిన ఉచిత ఇసుక హామీ తక్షణమే అమలు చేయాలి 

ప్రజలకు ఇచ్చిన ఉచిత ఇసుక హామీ తక్షణమే అమలు చేయాలి 

కొత్త చెరువు, న్యూస్ వెలుగు;  ఇసుక ఉచితంగా సరఫరా చేయాలని, ప్రతి నియోజకవర్గానికి ఒక ఇసుక రీచ్ ను ఏర్పాటు చేయాలని పథకాల అమలు చేయాలని, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఇఎస్ వెంకటేష్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇసుక కొరత, కరోనాతో పనులు లేక భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.ఇసుక కష్టాలు నేటికీ కొనసాగుతున్నాయి.గత ప్రభుత్వ హయాంలో ఇసుక లభించకపోవడం రేట్లు పెంచి విచ్చలవిడి అవినీతికి పాల్పడడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది.ప్రజల సమస్యలు పట్టకుండా భవన నిర్మాణలు చేస్తున్న ప్రజలకు గాని ఈ రంగంపై ఆధారపడిన కార్మికులకు గాని ప్రయోజనం లేకుండా చేయడంలో ఆ ప్రభుత్వం విఫలమైంది. నవరత్నాల ముసుగులో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ బోర్డు ద్వారా అమల్లో ఉన్న పధకాలు నిలిపివేసి బోర్డు నిధులన్నీ దారి మళ్లించడం బాధాకరమన్నారు.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఉచితంగా ఇసుకను ఇస్తామని హామీ ఇచ్చింది.100 రోజుల పాలనలో ఇసుక విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి 2014 నుంచి 2019 వరకు ఉన్న ఇసుక విధానం ఏదైతే ఉందో వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అర్హులైన వారికి పథకాల అమలు చేయాలని తహసిల్దార్ కి వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి బ్యాల్ల అంజి కొత్తచెరువు శాఖ కార్యదర్శి ముత్యాలు, శంకర్ రెడ్డి, శ్రావణి,నాగమణి,రమేష్, సిద్దు, సాకే వెంకటేష్ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు లక్ష్మన్న రామంజి నరసింహ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!