రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి; సిపిఐ

రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి; సిపిఐ

జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; 2024 ఎన్నికల సందర్భంగా కు టమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు 20,000 పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పిన వాగ్దానాన్ని అమలు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ  రైతు సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సోమవారం నాడు నాగుల కట్ట సచివాలయ అడ్మిన్ చంద్రశేఖర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా  సిపిఐ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాల వల్ల మన రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబం పై సుమారు రెండు లక్షల 45 వేల రూపాయలు రుణం ఉన్నది.రాయలసీమ జిల్లాల్లో కరువు పరిస్థితి మరో ప్రక్క కోస్తా తీర ప్రాంత జిల్లాలలో భారీ వర్షాలు వరదలు ముంచెత్తాయి రైతులు తీవ్రంగా నష్టపోయారు ఖరీఫ్ సీజన్లో సుమారు 12 లక్షల ఎకరాల్లో రైతాంగం పంటలు వేయలేకపోయారు రైతులు పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్న దశలో మీరు ప్రకటించిన రైతుకు 20వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. గత ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం ఆటకెక్కిందని. రాబోవు బడ్జెట్లో నీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఖర్చు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుత రబీ సీజన్లో రైతాంగం సాగు చేస్తున్న పంటలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా ప్రభుత్వమే భరించి రైతన్న ఆదుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు శ్రీనివాసులు సిపిఐ నాయకులు నాగేంద్ర సుమన్ చేనేత సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!