హలో విద్యార్థి…చలో విజయనగరం

హలో విద్యార్థి…చలో విజయనగరం

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఈ నెల 27 నుండి 30వ తేదీ వరకు విజయనగరంలో జరిగే ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర రాష్ట్ర మహాసభ కరపత్రాలు విడుదల చేశారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి సతీష్ కుమార్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్రం కోసం రవి అస్తమించిన బ్రిటిష్ పాలనపై విరోచిత పోరాటం చేసి ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన భగత్ సింగ్ రాజ్కూరు సుకుదేవుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సమాఖ్య.ఏఐఎస్ఎఫ్ 1939 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో ఆరుభవించి స్వాతంత్ర సంగ్రామంలో కీలకపాత్ర పోషించింది నాటి నుండి నేటి వరకు సమరసిల ఉద్యమాలకు వేదిక అయిందన్నారు.విద్యార్థులలో చైతన్యాన్ని రగిలించి సాంఘిక శక్తికి ఐక్యతను స్ఫూర్తి ప్రదాతగా నిలిచింది.ఏఐఎస్ఎఫ్ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ప్రవేశపెట్టిన మోకాలే విద్య విధానానికి సమాధి కట్టాలని ఆశాస్త్రీయ కషాయ భావాలతో భావితరాలను బానిసలను చేసే లోపభూషితమైన విధానాలకు కాలం చెల్లిందంటూ విద్యా ప్రవేటికన్నా కాషాయకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం అవిశ్రాంతంగా పోరు సాగిస్తున్న సంఘం ఏఐఎస్ఎఫ్ అన్ని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల సహాయ కార్యదర్శి రాజేష్,నాయకులు దేవరాజు,రవి,మల్లి,రమేష్,ప్రకాష్,మల్లయ్య,రాము, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!