
ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటించాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధనవంత్రి కాన్ఫరెన్స్ హాల్ లో మినిస్ట్రియల్ స్టాఫ్ తో సమీక్ష సమావేశం గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధనవంత్రి కాన్ఫరెన్స్ హాల్ లో మినిస్ట్రియల్ స్టాఫ్ తో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది ప్రతి ఒక్కరు సమయాపాలల్లో ఉండాలని వారికి నిర్ణయించిన సమయంలో వారు అందుబాటులో ఉండాలన్నారు ఆసుపత్రి సిబ్బంది ప్రతి ఒక్కరూ FRS అటెండెన్స్ తప్పకుండా వెయ్యాలన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలు మరియు ప్రజల నుండి ఫిర్యాదులు వస్తే వాటిని త్వరగా పూర్తి చేయాలని ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదన్నారు. ఆసుపత్రి మినిస్ట్రియల్ స్టాఫ్ ప్రతి ఒక్కరి పనితీరు గురించి పరిశీలిస్తుంటాను, ఎవరైనా నిర్లక్ష్యం వస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.సదరం నుండి ఫిర్యాదులు వచ్చిన వాటిని త్వరగా పరిష్కారం అయ్యేటట్లు చూడాలన్నారు.మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఏవైనా పెండింగ్ ఉన్న వాటిని త్వరగా పూర్తిగా అయ్యేటట్లు చూడాలని సిబ్బందికి ఆదేశించారు.మెడికల్ రికార్డ్ సెక్షన్ లో బర్త్, డెత్ సర్టిఫికెట్ల కోసం వచ్చే వారికి త్వరగా సర్టిఫికెట్లు మంజూరు అయ్యేటట్లు చూసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమానికి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.శ్రీరాములు, ఆఫీస్ అకౌంటెంట్స్, శ్రీ. కుమారస్వామి, లతీఫ్ బేగ్, ఆసుపత్రి ఏడి శ్రీ.రమేష్ బాబు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు తెలిపారు.