
ఓపి సేవలను తనిఖీ చేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్
కర్నూలు మేజర్ న్యూస్ వెలుగు : కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని ఆసుపత్రి సూపరిండెంట్ వెంకటేశ్వర్లు డాక్టర్లకు ఆదేశించారు. రోగులకు అందాల్సిన వైద్యసేవలపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తుసుకుంటామని హెచ్చరించారు. రోగులకు ఇచ్చే ఓపి సేవలపైనా ఆసుపత్రికి వచ్చే వారికీ అవగాహన కల్పించాలని సూపరిండెంట్ తెలిపారు . ఈ కార్యక్రమానికి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.శ్రీరాములు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, సింధు సుబ్రహ్మణ్యం, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, డా.కిరణ్ కుమార్, డా సునీల్ ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!