
ఇంటి, నీటి పన్నులను సకాలంలో చెల్లించాలి
నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు
సెలవు దినాల్లో సైతం పన్ను వసూలు కేంద్రాలు తెరిచే ఉంటాయి
కర్నూలు, న్యూస్ వెలుగు; నగరపాలక సంస్థకు చెల్లించవలసిన ఇంటి, నీటి పన్నులను సకాలంలో చెల్లించాలని నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు గురువారం ఒక ప్రకటనలో ప్రజలను కోరారు. నగరపాలక కార్యాలయంలో మార్చి 31వ తేదీ వరకు సెలవు దినాలైన రెండో శనివారం, ఆదివారం రోజుల్లో సైతం పన్ను వసూలు కేంద్రాలు తెరిచే ఉంటాయని, అదే విధంగా ప్రతి రోజు అదనంగా గంటపాటు (సాయంత్రం 6 గంటల వరకు) తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కమిషనర్ కోరారు.
Was this helpful?
Thanks for your feedback!