ఇడ్లీ వినియోగదారులు జాగ్రత్త

ఇడ్లీ వినియోగదారులు జాగ్రత్త

   జనతా ఫౌండేషన్ అధినేత కొత్తూరు సత్యం

కర్నూలు, న్యూస్ వెలుగు; ఇడ్లీ వినియోగదారులు తినే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జనతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కొత్తూరు సత్యనారాయణ గుప్తా తెలిపారు. శుక్రవారం ఆయనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఇడ్లీ అంటే ఇష్టపడని వారు ఉండారని ఇడ్లీ నోట్లో పడకపోతే ఆ రోజంతా ఎలాగో ఉంటుందని భావిస్తున్న వారు కి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇటీవల బెంగళూరులో ఆరోగ్యశాఖ అధికారులు జరిపిన అధ్యయనంలో కొన్ని రెస్టారెంట్లు కొన్ని వీధి వ్యాపారులు ఇడ్లీలను తయారు చేసే విధానంలో క్యాన్సర్ కు కారణం అయ్యే ప్రమాదం ఉందని తెలిసిందన్నారు. ఆరోగ్యశాఖలో తీసుకున్న 35 నమూనాలలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని నిర్ధారించింది అన్నారు. ఈ రసాయనాలు వినియోగదారులలో క్యాన్సర్ కు దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించారని తెలిపారు. సాధారణంగా సాంప్రదాయ పద్ధతిలో ఇడ్లీ పిండిని శుభ్రమైన కాటన్ దుస్తులపై వేసి ఆపై ఇడ్లీ పిండిని పెట్టి ఆవిరిలో ఉడికిస్తారని, కానీ చాలా హోటల్లో విధి వ్యాపారస్తులు ఇప్పుడు కాటన్ వస్త్రాలకు బదులుగా ప్లాస్టిక్ షీట్లను ఉపయోగిస్తున్నారని ఆయన తెలిపారు. అధిక వేడికి ప్లాస్టిక్ గురైనప్పుడు రసాయనాలను విడుదల చేస్తుందని, ఈ రసాయనాలలో కొన్ని క్యాన్సర్ కారకాలు మారే అవకాశం ఉందని తెలిపినట్లు ఇడ్లీలలో క్యాన్సర్ కారకాలు కనబడ్డాయని అధికారులు భావించారని దీనివల్ల ఎక్కడపడితే అక్కడ ఇడ్లీ తినే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు .కాబట్టి హోటల్ యజమానులు ఆరోగ్య సూత్రాలు పాటించాలని ఆయన కోరారు. గతంలో హోటల్ కు వెళ్లే సమయంలో ఇంట్లో నుండి క్యారియర్ లేక బాక్స్ తీసుకొని వెళ్లేవారు అని అందులో ఇడ్లీ చేయించుకోవడం ఇంకో గిన్నెలో సాంబారు వేయించుకునే వారని కాలక్రమమైన వస్తున్న మార్పుల వల్ల ప్లాస్టిక్ కవర్లో సాంబారు వేయించుకోవడం జరుగుతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!