
చిరంజీవి కాంగ్రెస్ లో ఉంటే ముఖ్యమంత్రి అవుతారు : కొత్తూరు సత్యం
న్యూస్ వెలుగు, కర్నూలు; కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి ఉంటే భవిష్యత్తులో ఆ ముఖ్యమంత్రి అవుతారని కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ గుప్తా జోస్యం చెప్పారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి సేవా దృక్పథంతో ప్రజల్లోకి వచ్చి ప్రజా సేవ చేసి ఆ తర్వాత ప్రజారాజ్యం స్థాపించి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్రం మంత్రి అయ్యారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అలాగే కొనసాగే ఉండి ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారని ఆయన తెలిపారు. రాజకీయాలకు దూరంగా సినిమాలకు దగ్గరగా ఇంకోవైపు సేవ చేస్తూ మౌనంగా ఉండటం సరికాదన్నారు . పార్టీలకు అతీతంగా పదవులు పొందడం కాదని ఆయన తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారని పెద్దల సభకు నామినేట్ అవ్వబోతున్నారని ఢిల్లీలో తన హవా చాటబోతున్నారని ప్రచారం జరుగుతుందన్నారు. ఒకసారి రాజకీయ ముద్ర పడ్డాక ఎంత చెరుపుకున్న చెరిగిపోదని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి అయ్యే లక్షణాలు ఉన్న చిరంజీవి మౌనంగా ఉండటం సరికాదని ఆయన తెలిపారు. ఏ లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ లక్ష్యసాధన దిశగా అడుగులు వేయాల్సిన చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండటం సరికాదన్నారు. రాజకీయ పార్టీలో ఉంటూ ఇతర పార్టీలను విమర్శించకుండా తన పని తన చేసుకునే స్వభావం చిరంజీవిలో ఉందన్నారు. విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చిరంజీవికి ఉండి ఉంటే ఇంకోలా ఉండేది అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆచితూచి అడుగులు వేయాలని పార్టీకి బలోపేతాని తెచ్చిపెట్టే నాయకులను నియమిస్తే బాగుంటుందన్నారు. స్వప్రయోజనాల కోసం పార్టీని వాడుకుంటూ స్వలాభం కోసం పాకులాడే నాయకులను నియమించకూడదని ఆయన కాంగ్రెస్ పార్టీకి హితువు పలికారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభలో పెట్టారని ఈసారి ఏ పార్టీ అనే ముద్ర లేకుండా పార్లమెంటులో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తుందని ఇంకోసారి ఆ తప్పిదం చేయవద్దని కూడా ఆయన ఈ సందర్భంగా తెలిపారు.