పోరాటం చేస్తున్న పట్టించుకోని ప్రభుత్వాలు

పోరాటం చేస్తున్న పట్టించుకోని ప్రభుత్వాలు

నంద్యాల ( డోన్) :  అంగన్వాడి వర్కర్లకు కనీస వేతనం 26 వేలు అందించాలని ఏఐటీయూసీ  డోన్ ఆర్డీవో  మహేశ్వర రెడ్డి కి నియోజక వర్గ అధ్యక్ష, కార్యదర్శులు పుల్లయ్య, అబ్బాస్ వినతిపత్రం అందించినట్లు తెలిపారు.  అంగన్వాడి అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జూలేఖ, ట్రెజరరీ ఎస్తేరమ్మ, డోన్ తాలూకా కార్యదర్శి స్వర్ణలత వినతి పత్రం ఆర్డీవో కి ఇచ్చిన అనంతరం వారు మాట్లాడు ఏళ్ల తరబడి తమ హక్కుల కోసం పోరాటం చేసిన ప్రభుత్వాల నుండి ఎలాంటి స్పందన లేదని వారు అన్నారు.  అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం కల్పించాలని కోరుతూ సోమవారం స్థానిక  ఆర్డిఓ మహేశ్వర రెడ్డి కి డిమాండ్ల తో కూడిన వినతిపత్రం అంచామన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 42 సంవత్సరాలుగా అంగన్వాడీ వర్కర్లు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విశేషంగా సేవలు అందిస్తూన్నరన్నారు. గర్భిణీలకు, బాలింతలకు, కిశోర బాలికలు, చిన్నారులకు పౌష్టికాహారం అందజేస్తూ… విద్య పట్ల అవగాహన కల్పిస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాల నిర్మలకు అంగన్వాడీల పాత్ర కీలకమైనదన్నారు.  అంగన్వాడీలపై రాజకీయ వేధింపులు అపాలన్నారు. ప్రతినెల వేతనాలు సక్రమంగా అందజేసి సంపూర్ణ పోషణ బిల్లును తక్షణమే అమలు చేయాలన్నారు. గ్రాడ్యూటిని వెంటనే అమలుచేసి అంగన్వాడీలను ఆదుకోవాలని అన్నారు.ఎప్పటికప్పుడు ఖాళీగా ఉన్న అంగనవాడి టీచర్లు, ఆయన పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!