వాస్తవాలు రాస్తున్న జర్నలిస్ట్ లపై అక్రమకేసులు మానుకోవాలి

వాస్తవాలు రాస్తున్న జర్నలిస్ట్ లపై అక్రమకేసులు మానుకోవాలి

జర్నలిస్ట్ లపై కేసులు పెట్టడం పత్రిక గొంతు నొక్కడమే

యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరమ్, ఎపియుడబ్ల్యూ జె,జర్నలిస్ట్ ల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా

న్యూస్ వెలుగు, కర్నూలు కలెక్టరేట్ : కర్నూలు జిల్లాలో పని చేస్తున్న జర్నలిస్టులకు పోలీస్ అధికారులు నోటీసులు ఇవ్వడం హేయమైన చర్య,ఇలాంటి నోటీసులు ఇవ్వడం పోలీస్ లు మానుకోవాలని,పత్రిక స్వేచ్ఛను హరించడం తప్ప ఇంకొకటి కాదని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరమ్,ఎపియుడబ్ల్యూ జె,జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షులు నీలం సత్యనారాయణ,సీనియర్ జర్నలిస్టు సత్యనారాయణ గుప్తా,సాక్షి బ్యూరో రవి వర్మ,ఎన్.టివి కరస్పాండెంట్ చంద్రశేఖర్, టివి – 9 కరస్పాండెంట్ నాగిరెడ్డి,శ్రీనాథ్ రెడ్డి,అవినాష్,ఉరుకుందు,లు మాట్లాడుతూ గత నెల ఆదోని,కర్నూలు,పత్తికొండలో పని చేస్తున్న వివిధ పత్రికల జర్నలిస్టులు రాసిన వార్తలకు నోటీస్ లను ఇచ్చారు.అదోనిలో వన్ టౌన్ పోలీసులు మామూళ్లు వసూళ్లు చేస్తున్నారని ప్రజాశక్తి దినపత్రికలో రాసిన వార్తకు స్టాఫ్ రిపోర్టర్ వినయ్ కుమార్ కు ఆదోని వన్ టౌన్ వారు,ఆదోని రూరల్ పోలీస్ వారు నోటీస్ లు ఇచ్చారు.అలాగే కర్నూలు నగరంలోని మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్,11న బోరుగడ్డ అనిల్ కు మళ్ళీ రాచ మర్యాదలే శీర్షికతో రాసినందుకు వార్త దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ రవిప్రకాష్ కు పోలీస్ లు నోటీస్ లు ఇచ్చారు. ఆలూరులో టివి 9,పత్తికొండలో ఆంధ్రప్రభ,హంస వాయిస్,విశాలాంధ్ర, జర్నలిస్టులకు నోటీస్ లు ఇచ్చారు.నేడు పోలీస్ లే కిడ్నాపర్స్ అవతారం ఎత్తి అనే శీర్షికతో సాక్షి దినపత్రికలో రాసిన వార్తకు సాక్షి జర్నలిస్ట్ కె.బి శ్రీనివాలుకు పోలీస్ లు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం బెదిరింపులకు గురిచేయడం తప్ప ఇంకొకటి కాదన్నారు.ఇదే వార్తను పలురకాల చానల్స్,పేపర్స్ లలో ప్రచురణ జరిగింది.కానీ కేవలం సాక్షి జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం టార్గెట్ చేయడం,భయబ్రాంతులకు గురిచేయడం అన్నారు.ఇలాంటి ధోరణిని పోలీస్ అధికారులు చేయడం బాధాకరం.వార్తలు రాసిన వాటిపై విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం మానేసి,పత్రిక గొంతు నొక్కడం సమంజసం కాదని తెలిపారు. జర్నలిస్టుల రక్షణ కోసం పోలీస్ లు హామీ ఇచ్చేలా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.తక్షణమే ఇలాంటి చర్యలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే ఈ ఘటనలపై జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.రాబోవు రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం డిఆర్ ఓ వెంకట నారాయణమ్మకు వినతిని అందించారు.ఈ కార్యక్రమంలో యునైటెడ్ కమిటీ సభ్యులు వి.విజయ్ కుమార్,జి.విజయ్ కుమార్,విజయకరణ్,సీనియర్ జర్నలిస్ట్ లు రాజశేఖర్ నాయుడు,శివశంకర్,రామకృష్ణ, ప్రతాప్,శ్రీనివాసులు,దామోదర్, అనిల్,శేఖర్,జర్నలిస్ట్ లు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!