
ప్రతి ఇంటా ప్రగతి లక్ష్యంగా జీరో పావర్టీ పి-4 పాలసీ అమలు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్
కర్నూలు, న్యూస్ వెలుగు; ప్రభుత్వ, ప్రయివేట్, ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఇంటినీ ప్రగతి పథంలో నడిపించి అందరి జీవితాల్లో వెలుగులు
నింపాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం జీరో పావర్టీ పి-4 పాలసీని అమలు చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుండి
ఆయా శాఖల ఉన్నతాధికారులు, జిల్లాకలెక్టర్ లతో జీరో పావర్టీ, ఎం ఎస్ ఎం ఈ సర్వే, కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు అంశం పై రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు..రాష్ట్రంలో జీరో పావర్టీని సాధించే దిశగా.. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించ తలపెట్టిన పి-4 (పబ్లిక్ పీపుల్ ప్రయివేట్ పార్ట్నర్ షిప్) పాలసీ అమలు పై తీసుకోవాల్సిన చర్యలపై సీ ఎస్ వివరించారు..ఇందులో భాగంగా ప్రజల నుండి అభిప్రాయాన్ని సేకరించడానికి పబ్లిక్ కన్సల్టేషన్ సర్వే ను నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు.. అలాగే స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 లో భాగంగా నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ ను తయారుచేయాలని సీ ఎస్ ఆదేశించారు..ఇందుకోసం నియోజక వర్గానికి ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు.. కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు భూమిని గుర్తించాలని, ఎమ్ ఎస్ ఎం ఇ సర్వే ను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని సి.ఎస్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ జీరో పావర్టీ P4 పాలసీ అమలులో భాగంగా పబ్లిక్ కన్సల్టేషన్ సర్వే నిర్వహణకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు..అన్ని వర్గాల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు..అలాగే నియోజకవర్గ విజన్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు..
వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య, కర్నూలు మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.