
జస్ట్ 5 నెలల్లో.. భారీగా పెరిగిన హెచ్ఐవీ కేసులు
ఉత్తరాఖండ్; ఉత్తరాఖండ్లోని రామ్నగర్లో హెచ్ఐవీ కలకలం రేగింది. కేవలం ఐదు నెలల్లోనే 20 మందికి ఈ వ్యాది సోకింది. దీంతో స్థానికంగా కలకలం మొదలైంది. ప్రతి ఏటా 20 హెచ్ఐవీ కేసులు నమోదు అయ్యేవని.. కానీ ఐదు నెలల్లోనే ఆ కేసులు నమోదు కావడం.. తాజా పరిస్థితికి అద్దం పడుతుందని వైద్యారోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాఖండ్లోని రామ్నగర్లో హెచ్ఐవీ కేసులు ఒక్కసారిగా ఇబ్బడి ముబ్బడి పెరిగాయి. దీంతో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారి హరీశ్ చంద్ర పంత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 5 మాసాల్లోనే 20 మందికి ఈ వ్యాధి సోకిందని తెలిపారు. గత కొన్నేళ్లుగా ఈ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM