
వాహనాలు తనిఖీ
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో మంగళవారం ఎల్లార్తి రహదారి నందు ఎస్ఐ బాల నరసింహులు వాహనాల తనిఖీ నిర్వహించారు.తనిఖీల్లో భాగంగా వాహనాల రికార్డులను పరిశీలించారు.అలాగే వాహనాల రికార్డులు సక్రమంగా లేని వాహనాలకు,ఓవర్ లోడ్ తో వెళ్తున్న వాహనాలకు జరిమానాలు విధించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాహనంతో పాటు సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని కలిగి ఉండాలని,నిబంధనల మేరకు మాత్రమే ప్రయాణికులను ఎక్కించుకోవాలని లేనిచో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda