
సుంకులమ్మ దేవాలయంపై కలశ స్థాపన
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని గల పగిడిరాయి గ్రామంలో నూతనంగా నిర్మించిన సుంకులమ్మ దేవాలయం పై ఊరి దేవర సందర్భంగా మంగళవారం రోజున నూతన కలశాన్ని స్థాపించారు.మాజీ జడ్పిటిసి పగిడిరాయి జగన్నాథ్ రెడ్డి ఉచితంగా పురాతన సుంకలమ్మ దేవాలయ నిర్మాణానికి స్థలం ఇవ్వడంతో గ్రామ ప్రజల సహకారంతో 16 లక్షల నిధులతో దేవాలయాన్ని నిర్మించారు.లాల్ రెడ్డి సుంకులమ్మ దేవాలయానికి కలశాన్ని విరాళంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జగన్నాథ్ రెడ్డి,బసిరెడ్డి, సర్పంచ్ గౌరవ సలహాదారులు హనుమంతు,లాల్ రెడ్డి,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!