
దైవందిన్నెలో కనకదాసు విగ్రహ ప్రతిష్టాపన
కర్నూలు, న్యూస్ వెలుగు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో దైవందిన్నెలో శ్రీ శ్రీ కనకదాసు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో కురువ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న కర్నూలు జిల్లా కురువ సంఘం ప్రధాన కార్యదర్శి రంగస్వామి పాల్గొన్నారు. గుడిసె శివన్న మాట్లాడుతూ శ్రీ భక్త కనకదాసు విగ్రహం ఏర్పాటు కృషి చేసిన దైవందిన్నె గ్రామ కులస్థులందరికి ధన్యవాదాలు తెలిపారు. ఐక్యంగా ఉండి తమ సమస్యలు పరిష్కారం కావడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పెద్ద ఎత్తున కులస్థులు పాల్గొని విజయవంతం చేసారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కురువ సంఘం ఉపాధ్యక్షులు తిమ్మాపురం ఉరుకుందు అంజనేయులు హంపయ్య కోశాధికారి కె సి నాగన్న సహయ కార్యదర్శి కోత్తపల్లి దేవేంద్ర పుల్లన్న తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!