విజయవంతమైన ప్రయోగం

విజయవంతమైన ప్రయోగం

శ్రీహరికోట నుంచి భూ పరిశీలన ఈఓఎస్ -08 ని ప్రయోగించిన ఇస్రో వెల్లడించింది. భూమిలో జరుగుతున్న మార్పులు, వాతావరణ పరిస్థితులు, భూకంపాలు, భూమి యొక్క నిశిత విశయాలను పరిశీలించేందుకు ఈ ప్రయోగం నిర్వహించినట్లు ఇస్రో తెలిపింది.

భారతదేశం యొక్క కొత్త రాకెట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV-D3)  175.5 కిలోల బరువున్న భూ పరిశీలన ఉపగ్రహం-08 (EOS-08)తో ప్రయోగించింది. చెన్నై ఆధారిత స్టార్టప్ స్పేస్ రిక్షా SR-0 చేత తయారు చేయబడిన మరొక చిన్న ఉపగ్రహం SR-0  కూడా తీసుకెళ్లినట్లు ఇస్రో దృవీకరించింది.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చిన్న ఉపగ్రహాల కోసం వెళ్లే మార్కెట్ ట్రెండ్ ఆధారంగా లో ఎర్త్ ఆర్బిట్ (LEO)కి 500 కిలోల మోసుకెళ్లే సామర్థ్యంతో SSLVని అభివృద్ధి చేసింది. సుమారు ఉదయం 9.17 గంటలకు, 34 మీటర్ల పొడవు మరియు దాదాపు రూ. 56 కోట్ల వ్యయంతో 119 టన్నుల మోసుకెళ్లగల  రాకెట్ మొదటి లాంచ్ ప్యాడ్ నుండి నింగీలోకి పంపినట్లు ఇస్రో వెల్లడించింది.  తోక వద్ద దట్టమైన నారింజ రంగు మంటతో ఉన్న రాకెట్ నెమ్మదిగా వేగం పుంజుకుని పైకి దూసుకెళ్లినట్లు ఇస్రో సైంటిస్టులు తెలిపారు. మిషన్ లక్ష్యాల విషయానికొస్తే, SSLV డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని మరియు భారతీయ పరిశ్రమ మరియు ప్రభుత్వ రంగ NewSpace India Ltd ద్వారా కార్యాచరణ మిషన్‌లను ప్రారంభిస్తామని ఇస్రో అధికారికంగా వెల్లడించింది.

Author

Was this helpful?

Thanks for your feedback!