
టి కే ఆర్ శర్మ శతజయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం సంతోషకరo
రాయలసీమ రత్నం స్వాతంత్ర్య సమరయోధులు టి కే ఆర్ శర్మ
క్లస్టర్ యూనివర్సిటీ వీసీ ఆచార్య డివిఆర్ సాయి గోపాల్
కర్నూలు, న్యూస్ వెలుగు; ప్రముఖ స్వతంత్ర సమరయోధులు గాంధేయవాది రాయలసీమ గర్వించదగ్గ విశిష్ట దేశభక్తులు టి కె ఆర్ శర్మ (తాళ్లపల్లి కరణం రామచంద్ర శర్మ ) అని శతజయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం సంతోషకరమని క్ల స్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య డివిఆర్ సాయి గోపాల్ అన్నారు. క్లస్టర్ యూనివర్సిటీ సభ భవనంలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. గాంధీ వర్ధంతి నాడు టికేఆర్ శర్మ శత జయంతి జరుపుతున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా బహుముఖీనమైన శర్మ గారి నాయకత్వాన్ని సమాజ ప్రేమను గుర్తుకు చేసుకుంటూ సదస్సు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. సాహితీ సదస్సు సహకారంతో శర్మ శతజయంతి సభను క్లస్టర్ యూనివర్సిటీ కెవిఆర్ క్యాంపస్ లో నిర్వహించటం జరుగుతుందని తెలిపారు. గాడిచర్ల ఫౌండేషన్, సాహితీ సదస్సు అధ్యక్షులు కురాడి చంద్రశేఖర కల్కూర మాట్లాడుతూ ప్రముఖ సోషలిస్టుగా వందల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిపెట్టిన సహృదయులు అలాగే గాంధీజీ,ప్రకాశం బాటలో సిద్ధాంతాల వెంట నడిచిన ఉన్నత శ్రేణి జాతీయ నాయకులు శర్మ అని గుర్తుచేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు గాంధేయ సమతావాదం -నేటి ఆవశ్యకత అనే అంశంపై వక్తృత్వము వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. శర్మ శత జయంతి సభను విజయవంతం చేయాలని కుమారుడు టికే కృష్ణమూర్తి అల్లుడు మురళి కుటుంబ సభ్యులు కోరారు. రిజిస్ట్రార్ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ
టీకేఆర్ శర్మ శత జయంతి ఉత్సవాల్లో క్లస్టర్ యూనివర్సిటీ భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశంలో జె ఎస్ ఆర్ కె శర్మ, డాక్టర్ పార్వతి దేవి, డాక్టర్ ఫామీద డాక్టర్ వింధ్యావాసిని, తదితరులు పాల్గొన్నారు.
రిజిస్ట్రార్ క్లస్టర్ యూనివర్సిటీ కర్నూలు.